కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మతి స్థిమితంలేని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది
మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య
Dec 20 2016 4:01 PM | Updated on Sep 4 2017 11:12 PM
మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మతి స్థిమితంలేని ఓ యువతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ముస్కు శ్యామల(21) అనే యువతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి లచ్చవ్వ కూతురిని పలు హాస్పిటల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది.
మంగళవారం తల్లి లచ్చవ్వ బీడీలు ఇచ్చేందుకు కంపెనీకి వెళ్లగా శ్యామల తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టగా అప్పటికే 90 శాతం కాలిపోయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా ఆమె అప్పటికే మృతిచెందింది.
Advertisement
Advertisement