రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం | thoused rupess pinchan after Acme | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం

May 19 2014 1:11 AM | Updated on Sep 5 2018 8:20 PM

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం - Sakshi

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త.

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద... పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. వెయ్యి అందించాలన్న పథకం త్వరలో అమలు కానుంది. ఐదు లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి వల్ల అది సాధ్యంకాలేదు.

 ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడీ ఈ పథకాన్ని (ఈపీఎస్-95) అమలు చేయనున్నట్టు ఈపీఎఫ్‌ఓ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.కనీస పింఛన్ కింద రూ.వెయ్యిని అందజేసేందుకోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ.1,217 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement