'33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తాం' | New houses to be constructed in 33 cities in AP, says Minister Narayana | Sakshi
Sakshi News home page

'33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తాం'

Sep 22 2016 10:09 PM | Updated on Sep 4 2017 2:32 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షా 93 వేల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడారు. లక్షా 20 వేల ఇళ్లను అపార్ట్‌మెంట్ల మోడల్‌లో నిర్మిస్తామన్నారు. 73 వేల ఇళ్లను లబ్ధిదారులు రుణాలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పారు. 18 నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement