జిల్లాలో ఓటర్ల నమోదు శాతం తగ్గిపోవడంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. త్వరలోనే జిల్లావ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి స్థానికులకు నమోదుపై
ఓటరు నమోదుపై దృష్టి
Mar 1 2014 11:19 PM | Updated on Mar 9 2019 3:30 PM
గుర్గావ్: జిల్లాలో ఓటర్ల నమోదు శాతం తగ్గిపోవడంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. త్వరలోనే జిల్లావ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి స్థానికులకు నమోదుపై అవగాహన పెంచేం దుకు కృషిచేయనుంది. జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ పి.ఎస్.చౌహాన్ శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ పలు అవగాహన కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా చేపట్టనున్నామన్నారు. హర్యానా రాష్ట్రం మొత్తం జనాభా లో 58 శాతం ఓటర్లుగా నమోదు చేయించుకోగా, గుర్గావ్ లోక్సభ నియోజకవర్గంలో 47 శాతం ఓట ర్లు మాత్రమే నమోదు చేయించుకున్నారని గణాం కాలు చెబుతున్నాయని, దీనికి రెండు కారణాలున్నాయని చౌహాన్ చెప్పారు. వీటిలో మొదటిది.. కొత్త గుర్గావ్లో పలువురు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపించడంలేదు.. రెండోది.. మేవాట్ ప్రాంతంలోని ముస్లిం మైనారిటీల్లో మహిళలు ఓటు వేయడాన్ని ప్రోత్సహించడంలేద’ని ఆయన వివరించారు.
లైఫ్కోచ్ రోడ్డులో నివసిస్తున్న ఒక మహిళ మాట్లాడుతూ.. నగరంలో తాను రెండేళ్లుగా జీవిస్తున్నానని చెప్పారు. అయినా ఎన్న డూ తాను తన పేరును ఓటరు లిస్టులో నమోదు చేయించుకోలేదన్నారు. నమోదు విధానం క్లిష్టంగా ఉండటం వల్ల తాను దానిపై శ్రద్ధ పెట్టలేదని ఆమె వివరించారు. సుశాంత్ లోక్ ఏరియాలో నివసిస్తు న్న ఆర్కిటెక్ట్ మనూ గుప్తా మాట్లాడుతూ.. పదేళ్ల కిందట తన పేరును ఓటరు లిస్టులో నమోదుచేయించుకున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీనుంచి తాను ఇక్కడికి వలస వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదుచేయించుకోలేదని తెలిసిందన్నారు. వారందరూ వివి ధ ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు కాబట్టి నమోదు విధానంపై ఎటువంటి అవగాహన లేకపోవడంతో ఓటరుగా నమోదుచేయించుకోవడంలేదని విశదీకరించారు. కాగా, మేవాట్ ప్రాంతంలోని 15 గ్రామాల్లో వచ్చేవారం నుంచి ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటుచేయనున్నట్లు చౌహా న్ చెప్పారు.
తమ పేర్లను నమోదుచేయించుకోవాలని స్థానికులకు అవగాహన కల్పిస్తామని ఆయన వివరించారు. ఆయా గ్రామాల పంచాయతీ పెద్దల ను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వివేక్ కాలియా కలిసి టరు నమోదు కార్యక్రమంపై సలహాలు, సూచనలు తీసుకుంటారన్నారు. అలాగే సదరు 15 గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చౌహాన్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మొత్తం 2,68,95, 407 కాగా, వారిలో 1,55,94,427 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. అంటే ప్రతి వెయ్యిమంది జనాభాకు 580 మంది ఓటర్లుగా నమోదుచేయించుకున్నారు. అయితే ఇదే సమయం లో గుర్గావ్ జనాభా 20,44,912 కాగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నవారి సంఖ్య కేవలం 9,36, 471 మంది. అంటే ప్రతి వెయ్యిమంది జనాభాకు 457 మంది మాత్రమే ఓటర్లుగా తమ పేర్లను నమోదుచేయించుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి.
Advertisement
Advertisement