బాణసంచా పరిశ్రమలో మళ్లీ పేలుడు చోటు చేసుకుంది. సాత్తూరులోని పరిశ్రమలో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు బలి అయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.
సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లా బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి శివకాశి మినీ జపాన్గా పేరు గడించింది. ఇక్కడ బాణసంచా తయారీలో నిమగ్నం అయ్యే కార్మికులకు దినదిన గండమే. ఎప్పడు ఏ పరిశ్రమలో పేలుడు చోటు చేసుకుంటుందోనన్న ఆందోళన ఆ పరిసరవాసుల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సాత్తూరు సమీపంలోని దైవపాండికి చెందిన పరిశ్రమలో పేలుడు ఆ పరిసరవాసుల్ని ఆందోళనలో పడేసింది. విరుదునగర్ జిల్లా సాత్తూరు ముత్తాండిపురంలో దైవ పాండికి చెందిన పరిశ్రమ ఉంది. ఇక్కడ వంద మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. ఉదయం యథా ప్రకారం సిబ్బంది విధులకు వెళ్లారు. వారికి కేటాయించిన గదుల్లో బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మూడో నెంబరు గదిలో ముడి పదార్థాలను సిద్ధం చేస్తున్న సమయంలో చెలరేగిన నిప్పు రవ్వలు పెను ప్రమాదానికి దారి తీశాయి. అక్కడ సిద్ధం చేసిన బాణసంచా పేలడంతో ఆ పరిసరాల్లో ఆందోళన నెలకొంది. ఇతర గదుల్లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. పేలుడు శబ్దంతో ఆ పరిసరాలకు చెందిన జనం పరుగులు తీశారు. అయితే లోనికి వెళ్లేందుకు సాహసించ లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఈ పేలుడు దాటికి మూడు నెంబరు గది నేలమట్టమైంది. ఇక్కడి మంటలు ఇతర గదులకు వ్యా పించని దృష్ట్యా, మరింత పెను ప్రమా దం తప్పినట్టు అయింది. సంఘటనా స్థలంలోనే ఎలుమచ్చం పట్టికి చెందిన మునియాండి భార్య సరస్వతి(44), మునుస్వామి భార్య సుబ్బుతాయ్(55), మాడస్వామి భార్య సెల్వి(25) మరణించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ముత్తుమారి, మునిరాజ్, సూర్యనారాయణ, సెల్వం, వీరమ్మలను చికిత్స నిమిత్తం సాత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంతో అధికార వర్గాలు సాత్తూరుకు ఉరకలు తీశాయి. ప్రమాద ఘటనపై విచారణ సాగిస్తున్నాయి. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
బాణసంచా పేలుడులో ఐదుగురు మృతి
Published Tue, Dec 27 2016 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement