శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
Feb 20 2017 10:48 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లు సోమవారం సాయంత్రం మయూర వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. సోమవారం శివుడికి ప్రీతిపాత్రం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
Advertisement
Advertisement