కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం | development is possible with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

Mar 30 2014 12:05 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి, భద్రత సాధ్యమని ఉత్తర చెన్నై పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకో అన్నారు.

ప్యారిస్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి, భద్రత సాధ్యమని ఉత్తర చెన్నై పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకో అన్నారు. స్థానిక కొరుక్కుపేట కేఎన్‌ఎస్ డిపో మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఉత్తర చెన్నై జిల్లా వ్యాపార సంఘం ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి 41వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.రాజా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్‌కేనగర్ ఈసెల్వం అధ్యక్షత వహించా రు.
 
ఈ సందర్భంగా ఉత్తర చెన్నై పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకోను కార్యకర్తలకు పరిచయం చేశా రు. కాంగ్రెస్ అభ్యర్థి బీజుచాకో మాట్లాడుతూ పదేళ్ల యూపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేద వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల రక్షణ కోసం నిర్భయ చట్టాన్ని ఏర్పాటు చేసి, దాని అమలుకు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు.
 
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు యూపీఏ ప్రభుత్వ విజయాలని వివరించారు. మాజీ ఎమ్మెల్యే ఈ.బలరామన్, ఎస్. వేణుగోపాల్, ఎర్నెస్ పాల్, ఎం.ఎస్. ద్రవ్యం, జిల్లా నిర్వాహకులు ఎస్.ఆర్.రాజేంద్రన్, ఎస్.కె. వీరారెడ్డి, కె.రాజేంద్రన్, ఎన్.ఆనందన్, ఎం.రామలింగం, కె.కన్నియప్పన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement