కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
భూపాలపల్లిలో మోదీ దిష్టిబొమ్మ దహనం
Nov 14 2016 2:03 PM | Updated on Mar 18 2019 7:55 PM
భూపాలపల్లి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆందోళన నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఛీఫ్ విప్ గండ్రా వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement