తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహకరిస్తున్నప్పటికీ రాష్ట్రం కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తోందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
నిధులను సర్కార్ పక్కదారి పట్టిస్తోంది: లక్ష్మణ్
May 10 2017 1:09 PM | Updated on Sep 5 2017 10:51 AM
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహకరిస్తున్నప్పటికీ రాష్ట్రం కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తోందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర వాటా నిధులను విడుదల చేస్తున్నా.. రాష్ట్ర వాటాను చెల్లించకుండా అభివృద్ధి పథకాలు ముందుకు వెళ్లకుండా అవరోధాలు సృష్టిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే మత రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు.
Advertisement


