ఉప ఎన్నికల పోరు..
‘బళ్లారి గ్రామీణం’నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ నుంచి మహంతేశ బరిలోకి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు వచ్చే నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఎంపిక చేసింది. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ స్థానంలో మహంతేశ కవటగిమఠలు పోటీ చేయనున్నారు.
గత శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి గతంలో బీ. శ్రీరాములు, శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బెల్గాం జిల్లా చిక్కోడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరి ఎన్నికైన సంగతి తెలిసిందే.
కాగా బళ్లారి అభ్యర్థి ఓబలేసు పార్టీ ఎస్సీ మోర్చాలో పని చేస్తున్నారని జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యడ్యూరప్ప కేజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా వారు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థుల ఖరారు
Published Wed, Jul 30 2014 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement