ఘాట్‌ రోడ్డులో ప్రమాదం: 15 మందికి గాయాలు | 15 injured in ghat road accident | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో ప్రమాదం: 15 మందికి గాయాలు

May 6 2017 4:12 PM | Updated on Sep 5 2017 10:34 AM

ప్రకాశం జిల్లాలో ఘాట్‌ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్‌ బోల్తా కొట్టింది.

వలేటివారిపాలెం : ప్రకాశం జిల్లాలో ఘాట్‌ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్‌ బోల్తా కొట్టిన సంఘటన శనివారం జరిగింది. నెల్లూరుజిల్లా రాజుపాలెంకు చెందిన భక్తులు 30 మంది డీసీఎం వ్యాన్‌లో వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి తరలివచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్‌ రోడ్డు దిగుతుండగా ఈ మధ్యాహ్నం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement