నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు: కోహ్లి

Virat Kohli Says Guwahati Absolutely Safe Over CAA Protests - Sakshi

న్యూఢిల్లీ: అసోంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదని, గువాహటిని సురక్షితం నగరంగా భావిస్తున్నట్లు తెలిపాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సమాయత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గువాహటిలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరనసల్లో హింసకు పాల్పడ్డారంటూ 190 మందిని అరెస్టు చేశారు. దీంతో అసోం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆడనుంది. (రోహిత్‌ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!)

ఈ నేపథ్యంలో అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రేక్షకులు కేవలం మొబైల్‌ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో అసోంలో నెలకొన్న పరిస్థితి గురించి విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ... ‘ ఈ విషయంలో(సీఏఏ) నేను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలనుకోవడం లేదు. ఇరు వర్గాల అభిప్రాయాలను పరిగణించాల్సి ఉంటుంది. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు. గువాహటి సురక్షితమైన నగరమని తెలుసు. మాకు అక్కడ ఎటువంటి ఇబ్బందలు తలెత్తవు’అని పేర్కొన్నాడు. ఇ​క టెస్టు మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదనపై కోహ్లి విముఖత వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా టెస్టుల్లో ఐదు రోజుల విధానం అమల్లో ఉందని, దాన్ని అలాగే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.(ఐసీసీ ప్రతిపాదనకు కోహ్లి నో)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top