
తెలుగు టైటాన్స్కు ఏడో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. బుధవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్
ప్రొ కబడ్డీ లీగ్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. బుధవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 19–29తో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో తెలుగు జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఆరంభంలో తమిళ్ తలైవాస్తో ఆడిన తొలి మ్యాచ్లో గెలిచిన రాహుల్ చౌదరి సేన ఆ తర్వాత ఒక్క మ్యాచ్లోనూ నెగ్గలేకపోయింది. గుజరాత్తో జరిగిన ఈ మ్యాచ్లో పేలవంగా ఆడింది. తొలి అర్ధభాగం ముగిసే సరికే 8–20తో పరాజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న టైటాన్స్ రెండో అర్ధభాగంలోనూ చెప్పుకోదగ్గ ఆటతీరును కనబరచడంలో విఫలమైంది.
రైడింగ్, టాకిల్లో గుజరాత్ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. తెలుగు జట్టు తరఫున రాహుల్, వికాస్ చెరో మూడు పాయింట్లు చేయగా, రాకేశ్ కుమార్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు సాధించారు. గుజరాత్ ఆటగాళ్లలో సచిన్ (11) అద్భుతంగా రాణించాడు. సుకేశ్ హెగ్డే 7, అబోజర్ మిగని 4 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 25–25తో టై అయ్యింది. నేడు జరిగే పోటీల్లో దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.