కేవలం 17 బంతులే...
ఆక్లాండ్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టును వరణుడు వదిలేలా లేడు. రెండో రోజు వర్షం కారణంగా 23.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా... శనివారం మూడో రోజు కూడా భారీ వర్షం పడటంతో కేవలం 17 బంతుల ఆట మాత్రమే సాగింది.
న్యూజిలాండ్ గడ్డపై జరగుతోన్న తొలి డే–నైట్ టెస్టులో ఓవర్నైట్ స్కోరు 229/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ శనివారం ఆట నిలిచిపోయే సమయానికి 233/4తో నిలిచింది. నికోల్స్ (52 బ్యాటింగ్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 వికెట్లు చేతిలో ఉన్న కివీస్ ప్రస్తుతం 175 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది.