మరో మైలురాయి చేరుకున్న ధోనీ | ms dhoni reaches another milestone, 350 dismissals as Wicketkeeper in odis | Sakshi
Sakshi News home page

మరో మైలురాయి చేరుకున్న ధోనీ

Jun 15 2016 4:08 PM | Updated on May 29 2019 2:49 PM

మరో మైలురాయి చేరుకున్న ధోనీ - Sakshi

మరో మైలురాయి చేరుకున్న ధోనీ

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయిని చేరుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ కీపర్గాను మరో ఘనత సాధించాడు.  అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మహీ కీపర్గా 350వసారి (స్టంపవుట్, క్యాచవుట్లు సహా) అవుట్ చేశాడు. బుధవారం హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో చిగుంబరను క్యాచవుట్ చేయడం ద్వారా ధోనీ ఈ ఘనత సాధించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చిగుంబుర క్యాచ్ను ధోనీ అందుకున్నాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధికమంది బ్యాట్స్మెన్లను డిస్మిసల్ చేసిన కీపర్లలో ధోనీ నాలుగో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో తాజా మ్యాచ్ ధోనీకి 278వ వన్డే. కాగా వన్డేల్లో అత్యధిక డిస్మిసల్ చేసిన కీపర్లలో తొలి మూడు స్థానాల్లో సంగక్కర (482), గిల్ క్రిస్ట్ (472), బౌచర్ (424) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement