జపాన్‌ చేతిలో భారత్‌ ఓటమి | Indian Mens Team Lost To Japan in The Quarterfinals of The Table Tennis | Sakshi
Sakshi News home page

జపాన్‌ చేతిలో భారత్‌ ఓటమి

Sep 17 2019 3:18 AM | Updated on Sep 17 2019 3:18 AM

Indian Mens Team Lost To Japan in The Quarterfinals of The Table Tennis - Sakshi

యోగ్‌యకార్తా (ఇండోనేసియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్రపంచ చాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత పురుషుల జట్టు 1–3తో జపాన్‌ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ 11–4, 11–7, 12–10తో హరిమోటో తొమోకాజు (జపాన్‌)పై గెలిచి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ 8–11, 12–10, 5–11, 12–14తో మహరు యోషిమురా చేతిలో... మూడో మ్యాచ్‌లో హరీ్మత్‌ దేశాయ్‌ 7–11, 11–6, 6–11, 2–11తో జిన్‌ టకుయ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 7–11, 0–11, 0–11తో హరిమోటో చేతిలో ఓడిపోవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. భారత్‌ ఇక 5 నుంచి 8 స్థానాల కోసం పోటీపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement