ఆసియా గేమ్స్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఇంచియోన్: ఆసియా గేమ్స్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించింది. వీటిలో 11 బంగారు, 10 రజత, 36 కాంస్య పతకాలున్నాయి. చైనా మొత్తం 343 పతకాలతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. వీటిలో 151 పసిడి పతకాలున్నాయి. దక్షిణ కొరియా, జపాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.
కాగా గత ఆసియా గేమ్స్తో పోలిస్తే భారత్కు ఈసారి పతకాలు దక్కాయి. గత ఈవెంట్లో భారత్ 14 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 65 పతకాలు సాధించింది.