షెన్జెన్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు.
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. చైనాలో గురువారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 67 ఎత్తుల్లో మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు.
ఈ టోర్నీలో హరికృష్ణ సాధించిన రెండు విజయాలూ ఆడమ్స్పైనే రావడం విశేషం. ఏడో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.