ప్రభుత్వానికి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తి
ధర్మశాల: అందమైన పర్వతాల మధ్య, ప్రకృతి సోయగంతో అందరినీ కట్టిపడేసే ప్రత్యేకత ధర్మశాల సొంతం. హిమాచల్ప్రదేశ్లోని ఈ చిన్న పట్టణం శివారులోనే బౌద్ధుల మత గురువు దలైలామా నివాసముండే మెక్లియోగంజ్ కూడా ఉంది. అయితే క్రికెట్ మ్యాచ్లకు వేదికగా మారిన తర్వాతే ఈ ప్రాంతానికి ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ. 200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుంది.
దాదాపు రెండేళ్ల తర్వాత ఒక వన్డే మ్యాచ్కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ నాలుగో వన్డే జరగనుంది. అయితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకట్టుకునే సౌకర్యాల విషయంలో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉంది. ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేకపోవడం, రైలు మార్గం, రెగ్యులర్ ఫ్లయిట్లు లేకపోవడం సమస్యగా మారింది.
దీనిపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ధర్మశాలకు క్రికెట్ ఎంతో గుర్తింపు తెచ్చింది. ఎన్నో సమస్యలు ఉన్నా అత్యుత్తమ స్టేడియంను నిర్మించగలిగాం. ఇక ఈ ప్రాంతానికి ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎయిర్పోర్ట్లో రన్వేను విస్తరించాలి. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత పర్యాటక అభివృద్ధి జరుగుతుంది’ అని ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.
‘క్రికెట్ పర్యాటకం’పై దృష్టి పెట్టండి!
Published Thu, Oct 16 2014 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement