శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది.
శ్రీలంకతో మూడో టెస్టు
లార్డ్స్: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 38 ఓవర్లలో నాలుగు వికెట్లకు 109 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం లంకపై 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో హేల్స్ (105 బంతుల్లో 41 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఫిన్ (6 బ్యాటింగ్) ఉండగా ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ప్రదీప్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు లంక తమ తొలి ఇన్నింగ్స్ను 95.1 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయ్యింది.