- భారత్, పాక్ సిరీస్పై గంగూలీ
- రవిశాస్త్రి సమర్థంగా పని చేస్తున్నారు
- కుర్రాళ్లు రాటుదేలారన్న మాజీ కెప్టెన్
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. ‘భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో భయాందోళనతో జీవిస్తున్న మన ప్రజల మనోభావాలు ఎంతో ముఖ్యం. ఆట జరిగే ముందు తీవ్రవాదం పూర్తిగా ఆగిపోవాలని బీసీసీఐ చెప్పడం సరైన నిర్ణయం. సాధారణ ప్రజలు కోరుకునేది కూడా అదే. క్రికెట్ కంటే దేశం ముఖ్యం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ కోర్టు తీర్పుతో బీసీసీఐ సంతృప్తి చెందితే శ్రీశాంత్ తిరిగి రావడం సమస్య కాదని, ఈ విషయంలో తన వివరణ ఇచ్చుకునేందుకు ఆటగాడికి బోర్డు అవకాశం ఇస్తుందని భావిస్తున్నానన్నాడు. లోధా కమిటీ తీర్పుపై ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న గంగూలీ, తాము శిక్షలు ఖరారు చేయమని, ఐపీఎల్ను బాగా నిర్వహించేందుకు కావాల్సిన సూచనలు మాత్రమే ఇస్తామని వెల్లడించాడు. అయితే గతంలో స్పాన్సర్లు, ప్రసారకర్తలతో చేసుకున్న ఒప్పందాల మేరకు కనీసం ఎనిమిది జట్లతోనే లీగ్ జరుగుతుందని గంగూలీ చెప్పాడు.
కోచ్కు డెరైక్టర్కు తేడా లేదు!
శ్రీలంక పర్యటన ముగిసేవరకు టీమిండియాకు రవిశాస్త్రినే డెరైక్టర్గా కొనసాగుతారని బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడైన గంగూలీ స్పష్టం చేశాడు. మరీ అవసరమనిపిస్తే ఆ తర్వాత కొత్త కోచ్ ఎంపికపై ఆలోచిస్తామన్నాడు. ‘రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్గా బాగా పని చేస్తున్నారు. నా దృష్టిలో కోచ్కు, డెరైక్టర్గా తేడా ఏమీ లేదు. పైగా ఆయనకు అండగా సమర్థులైన సహాయక సిబ్బంది ఉన్నారు.
మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే బృందాన్ని కొనసాగించడంలో తప్పేముంది’ అని ఈ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లను రాటుదేల్చిందని, ఆ అనుభవం శ్రీలంకలో ఉపయోగపడుతుందని సౌరవ్ అన్నాడు. లంక పటిష్టమైన ప్రత్యర్థే అయినా భారత్కు మంచి విజయావకాశాలు ఉన్నాయన్నాడు. ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న జింబాబ్వే పర్యటన ఫలితం గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. రహానే తదితరులు దానిని మరచి రాబోయే లంక సిరీస్పై దృష్టి పెట్టాలని సూచించాడు.
గెలిస్తే అంతా బాగుంటుంది!
టెస్టు, వన్డే జట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడం గతంలో అనేక జట్లు చేశాయని, భారత్కు మాత్రం ఇది కొత్త అని ఈ మాజీ కెప్టెన్ అన్నాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ వల్లే ఇది జరిగిందని అతను గుర్తు చేశాడు. ‘టీమ్ గెలిస్తే ఈ ప్రయోగం పని చేసినట్లు, ఓడితే విఫలమైనట్లు’ అని గంగూలీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు.
దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
Published Wed, Jul 29 2015 1:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement