సీఎస్‌కే లక్ష్యం 163

Delhi set target of 163 runs against CSK - Sakshi

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడుతూనే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. పృథ్వీ షా(17),శ్రేయస్‌ అయ్యర్‌(19), మ్యాక్స్‌వెల్‌(5), అభిషేక్‌ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్‌ పంత్‌(38) ఫర్వాలేదనిపించాడు.

చివర్లో విజయ్‌ శంకర్‌(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు‌), హర్షల్‌ పటేల్‌(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ 26 పరుగులు పిండుకోవడంతో చెన్నై ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.  చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top