100 మీటర్ల రేసులో దీప్తికి స్వర్ణం  | Deepti Wins Gold Medal In Khelo India 2020 | Sakshi
Sakshi News home page

100 మీటర్ల రేసులో దీప్తికి స్వర్ణం 

Jan 13 2020 10:07 AM | Updated on Jan 13 2020 10:07 AM

Deepti Wins Gold Medal In Khelo India 2020 - Sakshi

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణకు మరో స్వర్ణం లభించింది. గువాహటిలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం జరిగిన అండర్‌–17 బాలికల 100 మీటర్ల విభాగం ఫైనల్లో  జీవంజి దీప్తి విజేతగా నిలిచింది. దీప్తి 12.26 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్‌ రికార్డు నెలకొల్పింది. రుతిక శరవణన్‌ (తమిళనాడు), షెరోన్‌ మారియా (తమిళనాడు)లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement