జైపూర్‌ జోరుకు బ్రేక్‌

Dabang Delhi Beat Jaipur Pink Panthers - Sakshi

పట్నా: వరుస విజయాలతో ఊపుమీదున్న జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను దబంగ్‌ ఢిల్లీ నిలువరించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 35–24తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు షాక్‌ ఇచ్చింది. నవీన్‌ కుమార్‌ (12 పాయింట్లు), చంద్రన్‌ రంజిత్‌లు (10 పాయింట్లు) ఢిల్లీకి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7లో నాలుగో విజయాన్ని అందించారు. జైపూర్‌ స్టార్‌ రైడర్‌ దీపక్‌ హుడా విశేషంగా రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు లభించలేదు. రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 33–31తో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌పై గెలిచింది. గిరీష్‌ (7 పాయింట్లు), పవన్‌ (6 పాయింట్లు)లు రాణించి పుణేని గట్టెక్కించారు. మ్యాచ్‌లకు నేడు విశ్రాంతి దినం. రేపు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో తమిళ్‌ తలైవాస్‌; పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top