భారత మహిళల జట్టుకు చుక్కెదురు

Batting let Indian women down in third T20 against South Africa - Sakshi

మూడో టి20లో దక్షిణాఫ్రికా విజయం

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ దక్కించుకోవాలనుకున్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు టి20ల్లో గెలుపొందిన హర్మన్‌ప్రీత్‌ బృందం మూడో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌ వైఫల్యంతో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. తొలుత టీమిండియా 17.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది.

మిథాలీ రాజ్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరినా... మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేద కృష్ణమూర్తి (23; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఒకదశలో 91/2తో పటిష్టంగా కనిపించిన భారత్‌ను సఫారీ పేసర్‌ షబ్నమ్‌ 5 వికెట్లతో దెబ్బతీసింది. అనంతరం సఫారీలు ల్యూస్‌ ( 41; 5 ఫోర్లు), కెప్టెన్‌ నికెర్క్‌ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు), ట్రియాన్‌ (34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే విజయం సాధించారు. నాలుగో మ్యాచ్‌ బుధవారం సెంచూరియన్‌లో జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top