దేశవాళీ క్రికెట్ లో ధోని! | After 8 years, Dhoni may play domestic cricket | Sakshi
Sakshi News home page

దేశవాళీ క్రికెట్ లో ధోని!

Nov 17 2015 8:20 PM | Updated on Sep 3 2017 12:37 PM

దేశవాళీ క్రికెట్ లో ధోని!

దేశవాళీ క్రికెట్ లో ధోని!

టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.

బెంగళూరు: టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న విజయ్ హజారే ట్రోఫీలో  జార్ఖండ్ తరపున ధోని ఆడాలనుకుంటున్నాడు. ఇది కూడా పాకిస్థాన్ -టీమిండియాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో దేశవాళీ లీగ్ లో ఆడాలనుకుంటున్నట్లు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేన్ సెక్రటరీ రాజేశ్ వర్మ పేర్కొన్నారు.  దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాలనే కోరికను ధోని తాజాగా వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు.

 

' మేము ధోనితో మాట్లాడాం.  విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని ధోని మమ్ముల్ని అడిగాడు. ఆ సమయంలో పాకిస్థాన్-టీమిండియాల సిరీస్ లేకపోతే ధోని జట్టుతో కలుస్తాడు. ఆ ట్రోఫీలో ధోని ఎన్ని మ్యాచ్ లు ఆడతాడనేది కచ్చితంగా తెలియదు. అతని కోరితే జార్ఖండ్ కు ధోనినే కెప్టెన్ గా కొనసాగుతాడు' అని రాజేశ్ వర్మ పేర్కొన్నారు. ఒకవేళ ధోని ఆ ట్రోఫీలో ఆడినట్లయితే ఎనిమిది సంవత్సరాల తరువాత మళ్లీ దేశవాళీ మ్యాచ్ ల్లో పాల్గొనట్లవుతుంది.  చివరిసారిగా 2007లో కోల్ కతా లో జరిగిన సయ్యద్ ముస్తాఖా అలీ ట్వంటీ 20 చాంపియన్ షిప్ లో ధోని దేశవాళీ లీగ్ ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement