రాష్ట్రపతిగారూ తక్షణం జోక్యం చేసుకోండి.. జగన్‌ ట్వీట్‌ | YSRCP MPs called on President RamNath, requesting his urgent intervention, tweets YS Jagan | Sakshi
Sakshi News home page

హోదా కోసం పోరాటం మరింత ఉధృతం

Apr 18 2018 1:25 AM | Updated on Jul 24 2018 1:12 PM

YSRCP MPs called on President RamNath, requesting his urgent intervention, tweets YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి.. లేఖ అందించారని ట్విటర్‌లో వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్రపతికి సమర్పించిన లేఖ ప్రతిని పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement