‘ఈసీ వద్ద ఉండాల్సిన డేటా బాబుకు ఎక్కడిది’ | YSRCP MLA Isaiah Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఈసీ వద్ద ఉండాల్సిన డేటా బాబుకు ఎక్కడిది’

Mar 6 2019 12:04 PM | Updated on Mar 6 2019 12:13 PM

YSRCP MLA Isaiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం శంకుస్థాపనలతోనే నిండిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల డేటా చంద్రబాబు వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్‌ పేరుతో చంద్రబాబు, అతని కొడుకు లోకేష్‌ భారీ స్కామ్‌కు దిగారని అన్నారు. ఎన్నికల సంఘం చొరవ తీసుకుని తండ్రీ, కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించే కార్యక్రమానికి తెరలేపాడని మండిపడ్డారు. (‘ఏటీఎం, క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్స్‌ మార్చుకోవాలి’)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement