255వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan Praja Sankalpa Yatra 255th Day Schedule Released | Sakshi
Sakshi News home page

Sep 4 2018 8:33 PM | Updated on Sep 4 2018 8:54 PM

YS Jagan Praja Sankalpa Yatra 255th Day Schedule Released - Sakshi

సాక్షి, సబ్బవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 255వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత బుదిరెడ్లపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గుల్లెపల్లి, రవులంపాలెం క్రాస్‌, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌, సబ్బవరం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారు. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో జననేత పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి చిన్నగొళ్లాలపాలెం క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ బసచేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 254వ రోజు పాదయాత్ర మంగళవారం బుదిరెడ్లపాలెం వద్ద ముగిసింది. నేడు బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చద్రయ్యపేట, సుదివలస క్రాస్‌, అయ్యన్నపాలెం మీదుగా బుదిరెడ్లపాలెం వరకు 10.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2894.1 కిలోమీటర్లు నడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement