199వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan Padayatra Day 199 Schedule | Sakshi
Sakshi News home page

199వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Jun 25 2018 8:27 PM | Updated on Jul 26 2018 7:17 PM

YS Jagan Padayatra Day 199 Schedule - Sakshi

సాక్షి, అమలాపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 198వ రోజు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (మంగళవారం) ఇదే మండలం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది.

రేపు ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. తర్వాత అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్‌ చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత కొంకపల్లి, అమలాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం అమలాపురంలో జరిగే బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 198వ రోజు వైఎస్‌ జగన్‌ 7.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,421.3 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. కాగా, తెలంగాణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి సోమవారం వైఎస్‌ జగన్‌ కలిసి ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement