టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

Yendala Lakshminarayana Says BJP Will Replace TRS - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్‌.. ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తమ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగానే ఉందన్నారు. ఈ నెలలో(సెప్టెంబరు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటన ప్రారంభించి.. పాలమూరు నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top