'మన్మోహన్‌ జీ.. ఇప్పుడైనా నాకు అండగా ఉండండి' | Raja Asks Manmohan Singh Support | Sakshi
Sakshi News home page

'మన్మోహన్‌ జీ.. ఇప్పుడైనా నాకు అండగా ఉండండి'

Jan 4 2018 8:03 PM | Updated on Oct 9 2018 4:27 PM

Raja Asks Manmohan Singh Support - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఓ లేఖ రాశారు. ఇప్పటికైనా తనకు అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. 2 జీ స్పెక్ట్రం కేసులో రాజా, కనిమొళితోసహా 14 మంది నిర్దోషులుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో నుంచి బయటపడిన తర్వాత ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్‌ మంత్రి మండలిలో ఒకరైనా రాజా తొలిసారి ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో ..

'మీరు నాకు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఎన్నో కారణాలు అడ్డుకుంటున్నాయని నాకు తెలుసు. ఈ రోజు నేను నిర్దోషిగా నిలబడ్డాను. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఎప్పటికీ నమ్మదగినవాడినని, విశ్వసనీయుడినని మరోసారి గుర్తుచేసుకుంటున్నాను. 2 జీ కేసులో నిజమేమిటో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా గతంలో మాదిరిగా కాకుండా నాకు అండగా ముందుకొస్తారని అనుకుంటున్నాను. 2జీ కేసు యూపీఏ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకునేలా చేసింది. 15 నెలల జైలు జీవితంతోపాటు నా ఏడేళ్ల జీవితాన్ని తీసుకెళ్లింది' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement