‘మోదీ ఐఎస్‌ఐ వాళ్లను పిక్నిక్‌కు తీసుకొచ్చారు’ | PM allowed Pak ISI to picnic at Pathankot | Sakshi
Sakshi News home page

‘మోదీ ఐఎస్‌ఐ వాళ్లను పిక్నిక్‌కు తీసుకొచ్చారు’

Dec 12 2017 4:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

PM allowed Pak ISI to picnic at Pathankot - Sakshi

సాక్షి, పట్నా : ప్రధాని నరేంద్రమోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ఓ కపటమైన వ్యక్తి అని పిలవకుండానే ఆయన పాకిస్థాన్‌ వెళ్లి అక్కడి కరడు గట్టిన ఐఎస్‌ఐ వారిని భారత్‌లోకి విహారయాత్ర (పిక్నిక్‌)కు తీసుకొచ్చారని మండిపడ్డారు. భారత్‌కు పఠాన్‌కోట్‌ అత్యంత ముఖ్యమైన మిలిటరీ స్థావరం అని అందులోకి ఐఎస్‌ఐకు చెందిన వారు పిక్నిక్‌కు వచ్చినట్లుగా వచ్చి వెళ్లారని, అందుకు కారణం మోదీనే అని ఆయన విరుచుకుపడ్డారు.

పాకిస్థాన్‌తో కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కయిందని ప్రధాని మోదీ ఆరోపించిన నేపథ్యంలో స్పందించిన లాలూ తీవ్రంగా దుయ్యబట్టారు. నిజంగా మోదీకి పాకిస్థాన్‌ అంటే అసహ్యం ఉంటే ఎందుకు పాక్‌కు అత్యంత సానుకూల దేశం హోదా నుంచి తొలగించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆహ్వానించకుండానే ప్రధాని మోదీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇంటికి వెళ్లారని, అంతకుముందు తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై చేసిన తీవ్ర ఆరోపణ విషయంలో మోదీ, ఆయన పార్టీ బలంగా నిలబడదని నమ్ముతున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement