ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్‌ సీఎం | Nitish Kumars 3 Word Reaction To Arvind Kejriwals Victory | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్‌ సీఎం

Feb 11 2020 3:42 PM | Updated on Feb 11 2020 10:21 PM

Nitish Kumars 3 Word Reaction To Arvind Kejriwals Victory - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

(హస్తిన తీర్పు : ‘ఇది ఢిల్లీ ప్రజల విజయం’)

ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. 'జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)' అంటూ ఆయన మూడు ముక్కల్లో కేజ్రీవాల్‌ విజయంపై తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో నితీశ్‌ సారథ్యంలోని జేడీయూ పొత్తు నేపథ్యంలో ఢిల్లీలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పోటీ చేసింది. అమిత్ షాతో కలసి నితీశ్ మూడు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నితీశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని.. వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్‌కు సీఎం జగన్‌ అభినందనలు

ఆప్‌ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర

Advertisement
 
Advertisement
Advertisement