అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా? : కన్నా | Kanna Lakshminarayana Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా? : కన్నా

Oct 20 2018 2:42 PM | Updated on Oct 20 2018 2:52 PM

Kanna Lakshminarayana Comments On Chandrababu Naidu - Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  అగ్రిగోల్డ్ బాధితుల కోసం వారం రోజుల రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఏపీలో అవినీతి పాలన జరుగుతోందని విమర్శించారు. ఏపీకి ద్రోహాం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం హాస్యాస్పదమన్నారు.

హాయ్ లాండ్ కాజేసేందుకు చంద్రబాబు ఏకంగా అగ్రిగోల్డ్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలీసు భద్రత లేకుండా టీడీపీ నేతలు ప్రజల్లో తిరగలేరని ఎద్దేవా చేశారు. మరోసారి టీడీపీకి అధికారం కట్టబెడితే ఏపీని చంద్రబాబు అమ్మేస్తారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement