కాంగ్రెస్‌తో పొత్తా.. ఇప్పుడే చెప్పలేను!

Kamal Hasan meets Sonia Gandhi, chats about Tamil Nadu politics - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పుడే చెప్పలేనని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న తరువాత కమల్‌ మీడియాతో మాట్లాడారు. పొత్తు అంశాన్ని కాంగ్రెస్‌ అగ్ర నేతల వద్ద ప్రస్తావించలేదని అన్నారు. రాజకీయాల్లో తన దారేదో తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని కలిశానని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే విషయంపై తన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అన్నారు. రాహుల్, కమల్‌ల భేటీపై స్పందించేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ నిరాకరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top