పొత్తు కుదరకపోతే!.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ..
సాక్షి, న్యూఢిల్లీ : నేటి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ బుధవారం జరిగిన కమిటీ మీటింగ్లో రెండో జాబితాకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసింది. అసంతృప్త నేతలను స్క్రీనింగ్ కమిటీ బుజ్జగించింది. సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీతో సమస్యలేదంటోంది కాంగ్రెస్.
టీజేఎస్, సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లోనూ ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పూర్తిచేసింది. ఒకవేళ పొత్తు కుదరకపోతే ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ చేయించాలని చూస్తోంది. రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.