‘కవిత కోసం కేసీఆర్.. కొడుకుల కోసం డీఎస్’

Congress Leader Revanth Reddy Comments On Nizamabad Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనన్నారు. కవిత కోసం కేసీఆర్ తాపత్రయం పడితే.. కొడుకుల కోసం డీఎస్ ఆరాటం పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో బీసీలను అవమానిస్తున్నారని మాట్లాడిన దానం నాగేందర్, ఇప్పుడు డీఎస్‌కు జరిగిన అవమానంపై స్పందించాలని తెలిపారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ పర్యటనపై కూడా రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్‌కు విజయవాడలో గుట్టమీద అమ్మవారు.. గుట్టకింద కమ్మ వారు గుర్తుకొచ్చారని రేవంత్ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top