సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై పార్టీలో అసంతృప్తి క్రమంగా సెగలుగక్కుతోంది. పీఠంపై కన్నేసిన ఆశావహులు పలువురు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తమ్ మూడున్నరేళ్ల పనితీరు బాగా లేదని, ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ పార్టీ పట్ల నమ్మకం సడలుతోందని అధ్యక్షుడు రాహుల్కు, ఇతర పెద్దలకు వివరించాలని నిశ్చయించారు. రాహుల్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో పాటు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్రెడ్డి, రేవంత్రెడ్డి, శ్రీధర్బాబు సహా దాదాపు 21 మంది నేతలు మంగళవారం ఢిల్లీ వచ్చారు.
వారంతా బుధవారం ఉదయం 10.15కు ఆయనతో భేటీ అవనున్నారు. పార్టీ పరిస్థితిని వీలైతే రాహుల్కే నేరుగా చెప్పాలని, లేదంటే పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్ను తప్పించేందుకు అవసరమైతే అంతా ఏకం కావాలని నేతలంతా మంగళవారం మంతనాలు సాగించినట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా కుంతియాతో లాభం లేదని, ఆజాద్ వంటి బలమైన మైనారిటీ నేత కావాలని కూడా పలువురు నేతలు భావిస్తున్నారు. సౌమ్యుడన్న ఉద్దేశంతోనే ఉత్తమ్ నాయకత్వాన్ని గ్రూపులకతీతంగా అంగీకరిస్తే ఇప్పుడాయన తానే పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆయనకసలు పోరాట పటిమే లేదని ఆక్షేపించారు.
అధికారం తన వద్దకే నడుచుకుంటూ రావాలనుకునే వారితో పార్టీ ముం దుకు సాగదంటూ విమర్శించారు. అధికార పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూంటే విపక్ష పార్టీ నేత లు ఇళ్లకు, పార్టీ కార్యాలయాలకు పరిమితమైతే ప్రజ లెలా నమ్ముతారని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత ప్రశ్నించారు. నాయకులకు పనే లేకుండా పోయిందని, ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్లు కావాలంటే ఎలాగని ఓ యువ నేత వాపోయారు.
నాయకత్వాన్ని మార్చండి..
Published Wed, Jun 20 2018 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement