జ్యోతి కుటుంబానికి కేంద్ర మంత్రి భరోసా | YSRCP MPs Meet Minister Jaishanker In Delhi To Return Jyothi From Chaina | Sakshi
Sakshi News home page

జ్యోతిని స్వదేశానికి తీసుకోస్తామని కేంద్ర మంత్రి హామీ

Feb 7 2020 3:17 PM | Updated on Feb 10 2020 2:50 PM

YSRCP MPs Meet Minister Jaishanker In Delhi To Return Jyothi From Chaina - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని కర్నూలుకు రప్పించాలని నంద్యాల, అనకాపల్లి ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్‌ వెంకట సత్యవతి పార్లమెంటులో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయజంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చైనాలో ఉన్న జ్యోతితో మంత్రి జయశంకర్‌ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైనా ఎంబసీతోనూ మంత్రి జయశంకర్‌, ఎంపీ పోచా బ్రహ్మనంద రెడ్డి మాట్లాడారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కర్నూలులో జ్యోతి తల్లి ప్రమీలాదేవి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో మాట్లాడుతుంటే అస్వస్థతకు గురయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement