నిర్భయ చట్టం తెచ్చినా.. | Venkaiah Naidu Says Political Will Must To Prevent Rapes | Sakshi
Sakshi News home page

నిర్భయ చట్టం తెచ్చినా..

Dec 8 2019 3:11 PM | Updated on Dec 8 2019 6:07 PM

Venkaiah Naidu Says Political Will Must To Prevent Rapes - Sakshi

కేవలం నూతన చట్టాల ద్వారానే  మహిళలపై నేరాలను నియంత్రించలేమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై వేధింపుల నిరోధానికి నూతన చట్టాలు తీసుకురావడం పరిష్కారం కాదని, రాజకీయ సంకల్పం, పాలనాపరమైన చర్యలు అవసరమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, నిర్భయ చట్టం​ తీసుకువచ్చినా మహిళలపై నేరాలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌, ఉన్నావ్‌లో జరిగిన ఇటీవలి సంఘటలను ప్రస్తావిస్తూ కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు తక్షణమే నిలిచిపోయేలా మనమంతా ప్రతినబూనాలని పిలుపు ఇచ్చారు. సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement