1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ | UP to give free power connections to 1.72 lakh families | Sakshi
Sakshi News home page

1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్

Jul 19 2014 11:09 AM | Updated on Sep 2 2017 10:33 AM

1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్

1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్

రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 201 తహసీళ్లకు గాను 166 చోట్ల 33/11 కెవి సబ్స్టేషన్ల నిర్మాణం ఈ సంవత్సరం అక్టోబర్నాటికల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. మిగిలినవి 2015 మార్చికి పూర్తవుతాయి.

రాష్ట్రమంతటికీ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రణాళిక కోసం 122 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంపారా-డి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, హర్దువాగంజ్, పాంకా విస్తరణ, ఓబ్రా-సి, ఘాతంపూర్, మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను తగిన కాలావధిలోగా పూర్తి చేయాలన్నారు. లోహియా గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటును సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,200 సోలార్ పంపులను ఏర్పాటుచేసేందుకు కూడా నిధులు విడుదల చేశామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement