ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two Terrorists Killed In Encounter By Security Forces in Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని షోపియాన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ సైన్యం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతుండటంతో భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తూ కుట్రలను తిప్పికొడుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top