యూపీలో ఘోర రైలు ప్రమాదం | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రైలు ప్రమాదం

Published Sat, Aug 19 2017 8:23 PM

యూపీలో ఘోర రైలు ప్రమాదం

సాక్షి, లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది  మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్‌ వ్యాన్స్‌, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. 

Advertisement
Advertisement