సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలపై ఈసీ ఆరా | Sadhvi Pragya Thakur Booked For Remarks On Hemant Karkare | Sakshi
Sakshi News home page

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలపై ఈసీ ఆరా

Apr 19 2019 5:39 PM | Updated on Apr 19 2019 5:39 PM

Sadhvi Pragya Thakur Booked For Remarks On Hemant Karkare - Sakshi

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఈసీ సీరియస్‌..

భోపాల్‌ : ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్‌ కర్కారేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్‌ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. ముంబై ఏటీఎస్‌ మాజీ చీఫ్‌ కర్కారేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఆమెపై ఫిర్యాదు అందిందని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్దారించారు. ప్రజ్ఞా సింగ్‌పై తాము స్వీకరించిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని సీఈఓ స్పష్టం చేశారు.

కాగా, 2008 మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణలో కర్కారే తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ దర్యాప్తు అధికారి, మాజీ ఎటిఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కారేపై అంతకుముందు ఆమె మండిపడ్డారు. తాను శపించిన కారణంగానే  కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.  నిరపరాధిని, సన్యాసిని  అయిన తనను వేధించినందుకు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడని, ఉగ్రవాదులు ఆయనను హతమార్చారని ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement