మార్పులు ఒప్పుకోం | Raising the opposition in the Rajya Sabha on employment guarantee | Sakshi
Sakshi News home page

మార్పులు ఒప్పుకోం

Nov 28 2014 1:41 AM | Updated on Sep 2 2017 5:14 PM

మార్పులు ఒప్పుకోం

మార్పులు ఒప్పుకోం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు....

ఉపాధి హామీపై రాజ్యసభలో ధ్వజమెత్తిన విపక్షాలు
 
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని మూసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని  ధ్వజమెత్తాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి హామీపై సావధాన తీర్మానం ఇచ్చిన సీపీఐ ఎంపీ డి.రాజా మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరచి, ఆ తర్వాత స్వస్తి పలికే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

పథకంలో మార్పులు చేసి అవినీతికి కేంద్రం దోహదం చేస్తోందని సీపీఐతోపాటు విపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో ఈ పథకం మంచి ఫలితాలను సాధించిందని, రూ.1.80లక్షల కోట్లు వేతనాల కింద చెల్లించామని, ఐదుకోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement