- చిరుద్యోగులకు వెసులుబాటు
న్యూఢిల్లీ: చిరుద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా నెలవారీ వేతనం పొందుతున్న కార్మికులు ఇకమీదట ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించడం ఐచ్ఛికం కానుంది. అయితే యాజమాన్యాలు మాత్రం ఈ పథకానికి తమ వంతు వాటాను చెల్లించాల్సిందే. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనల్లో వేతన పరిమితి ఎంతనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఉద్యోగులందరూ బేసిక్ శాలరీ, డీఏతోసహా తమ బేసిక్ వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్ వాటాగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా యాజమాన్యాలు తమ వంతు వాటాను చెల్లిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకం, కొత్త పెన్షన్ పథకం(ఎన్పీఎఫ్)లలో ఏదో ఒకదానిని ఎంచుకునే సౌలభ్యం సంఘటితరంగ ఉద్యోగులకు లభించనుంది. అదేవిధంగా ఈఎస్ఐ కల్పించే ఆరోగ్య సదుపాయాలు లేదా బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన ఆరోగ్య బీమాలలో ఏదో ఒకదానిని ఎంచుకునే వెసులుబాటు సైతం వారికి లభించనుంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తుందని జైట్లీ తెలిపారు. ఈపీఎఫ్వో సామాజిక భద్రతా పథకాల కింద ప్రస్తుతం ఐదుకోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
ఈపీఎఫ్, పీపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ.తొమ్మిదివేల కోట్లతో(ఈపీఎఫ్లో రూ.6 వేల కోట్లు, పీపీఎఫ్లో రూ.3 వేల కోట్లు) వృద్ధుల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తాన్ని వృద్ధాప్య పింఛన్లు పొందేవారు, బీపీఎల్ కార్డుదారులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతరు నిమ్నవర్గాలకు చెందినవారికి ప్రీమియం చెల్లింపులకోసం వినియోగిస్తారు.
ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టాల్లో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ శాలరీని ఏ విధంగా పొందాలో వారే నిర్ణయించుకోవచ్చు. సంబంధితులందరితో చర్చించిన అనంతరం ఈ చట్టాన్ని సవరించనున్నట్టు జైట్లీ తెలిపారు.
పీఎఫ్ వాటా చెల్లింపు ఇక ఐచ్ఛికం
Published Sun, Mar 1 2015 4:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement