తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉద్యోగులు ఘనంగా అంజలి ఘటించారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రొఫెసర్ జయశంకర్కు పలు రాజకీయ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.