మీ భాగస్వామితో విడిపోయారా..! | Pre-wedding' Shimla tour for middle-aged 'singles' ahmedbad | Sakshi
Sakshi News home page

మీ భాగస్వామితో విడిపోయారా..!

Feb 20 2017 4:04 PM | Updated on Aug 17 2018 5:55 PM

మీ భాగస్వామితో విడిపోయారా..! - Sakshi

మీ భాగస్వామితో విడిపోయారా..!

గుజరాత్‌కు చెందిన ‘వినా ముల్యే అమూల్య సేవ’ పేరుతో ఓ సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించే చర్యకు ఉపక్రమించింది.

అహ్మదాబాద్‌: గుజరాత్‌కు చెందిన ‘వినా ముల్యే అమూల్య సేవ’ పేరుతో ఓ సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించే చర్యకు ఉపక్రమించింది. ఇందుకోసం పది రోజుల షిమ్లా పర్యాటనను సిద్ధం చేసింది. మిగితా టూర్ల మాదిరిగా కాకుండా చాలా తక్కువ ధరల్లోనే ఈ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో నమోదుకావాలనుకునేవారు కేవలం రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో హోటల్‌ ఖర్చు, ఆహారం, ఆయా ప్రాంతాల సందర్శన, లగ్జరీ బస్సులో ప్రయాణం ఉంటుంది.

35 ఏళ్ల నుంచి ఆ పైన వయసు ఉండి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారు, భర్త చనిపోయినవారు, భార్య చనిపోయినవారు ఈ టూర్‌కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందులో మరోసదుపాయం ఏమిటంటే మహిళలకు ట్రాన్స్‌పోర్టేషన్‌ టారిఫ్స్‌ ఉండవట. భారతీ రావల్‌ అనే వ్యక్తి ఈ టూర్‌ వివరాలు తెలియజేస్తూ  ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైందని ఒక్క గుజరాత్‌ నుంచే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి కూడా పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారట.

వీళ్లలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. ఓ ఇద్దరు ఎన్నారైలు, ఓ 85 ఏళ్ల వ్యక్తి, 72 ఏళ్ల మహిళ కూడా ఉందని ఆయన తెలిపారు. ఒంటరిగా ఉంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారికి ఈ పర్యటన ఓదార్పునివ్వడమే కాకుండా ఈ పది రోజుల్లో వారు ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా ఒక భాగస్వామిని ఎంచుకున్నట్లవుతుందని, ఇది తమ దృష్టిలో మానవతా దృక్పథంతో చేసే సేవ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement