‘ఆ పోస్టర్లు మా పని కాదు’

Posters depict PM Modi as Mahishasura, Rahul as Shiva - Sakshi

పట్నా : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ర్యాలీకి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీని మహిషాసురుడిగా, రాహుల్‌ను శివుడిగా వర్ణిస్తూ వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్‌ పార్టీ ప్రతిస్పందించింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్‌ మద్దతుదారులే ఏర్పాటు చేశారని బీజేపీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. రాహుల్‌ను రాముడిగా, ప్రియాంక గాంధీని దుర్గామాతగా అభివర్ణించే మరికొన్ని పోస్టర్లనూ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లపై స్ధానిక నివాసి ఫిర్యాదు మేరకు సివిల్‌ కోర్టులో కేసు నమోదు చేశారు.

రాహుల్‌,  బిహార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మదన్‌ మోహన్‌ ఝాపై హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. కాగా బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్‌ ఏర్పాటు చేయలేదని, ఎవరో రూపొందించిన పోస్టర్లపై తమను నిందించడం తగదని మదన్‌ మోహన్‌ ఝా వివరణ ఇచ్చారు. పార్టీ నేతలెవరైనా ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైతే వారిపై కఠిన చర్యలు చేపడతామని పార్టీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ చంద్ర మిశ్రా వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top